సంక్షిప్త వార్త మాలిక
నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో పలు శాఖల అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. పన్నుల వసూళ్ళలో జాప్యంపై అధికారులు, సిబ్బందిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన కావలి వాసి మధుసూదన్ రావు కుటుంబాన్ని కేంద్ర మంత్రి తన కుటుంబ సభ్యులు, బీజేపీ నేతలతో కలిసి పరామర్శించారు. మధుసూదన్ రావు చిత్రపటానికి వారంతా నివాళులు అర్పించారు.
అనుమానాస్పద వ్యక్తులు ,వస్తువులు కనబడితే వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కృష్ణ కాంత్ సూచించారు. ఇండియా పాకిస్తాన్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఆయన కృష్ణపట్నం పోర్ట్…ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రం తదితర ప్రాంతాల్లో పర్యటించారు.
భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో శ్రీహరికోటలో హై అలర్ట్ ప్రకటించారు. దేశంలోని 11 ముఖ్యమైన ఇస్రో కేంద్రాల్లో భద్రతా వ్యవస్థలను కట్టుదిట్టం చేశారు.
పొదలకూరులోని సత్యనారాయణ లే అవుట్ లోని ప్రజా అవసరాల కోసం కేటాయించిన 286 అంకణాల స్థలం అన్యాక్రాంతం అవుతుందని ఇటీవల స్థానికులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆ స్థలాన్ని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సందర్శించారు.
పెహల్గాం దాడిని ఆదిశంకర ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు తీవ్రంగా ఖండించారు. సింధూర ఆపరేషన్ ను వారు అభినందిస్తూ నెల్లూరు నగరంలో భారీ శాంతియుత ర్యాలీ నిర్వహించారు.
బుచ్చిరెడ్డిపాళెం మండలం నాగమాంబాపురం గ్రామంలోని డ్రైనేజీలో పేరుకుపోయిన మురుగును పారిశుధ్య కార్మికులు తొలగించారు. ఎంపీడీవో శ్రీహరి, ఈవోపీఆర్డీ నారాయణరెడ్డి ఆదేశాలతో కార్యక్రమాన్ని చేపట్టామని కార్యదర్శి సింధూర తెలిపారు.
నెల్లూరులో వీఆర్ హైస్కూల్ ఆధునీకరణ పనులను రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. పనుల నాణ్యతపై ఆయన అధికారులకి పలు సూచనలు, సలహాలు చేశారు.
ముత్తుకూరు మండలం…పొట్టెంపాడు గ్రామంలోని వాగు కాలువలో జరుగుతున్న పూడికతీత పనులను ఎమ్మెల్యే సోమిరెడ్డి పరిశీలించారు. కాలువ పూడికతీత… ఆయకట్టు వివరాలను ఆయన ఇర్రిగేషన్ అధికారులను ఆడిగితెలుసుకున్నారు.
నెల్లూరు నగరం భగత్ సింగ్ కాలనీలో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. కాలనీలోని ఇంటింటికెళ్లి తమకు శాశ్వత ఇళ్ల పట్టాలు మంజూరయ్యాయని శుభవార్త చెప్పారు. నారాయణ సార్ తామంతా మీకు ఆజన్మాంతం రుణపడి ఉంటామని చెప్పారు.
నిత్యం పని భారంతో జీవిస్తున్న ఆటో కార్మికుల్లో మానసిక ఉల్లాసం కలిగించేందుకు సీఐటీయూ కమిటీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని నార్త్ ట్రాఫిక్ ఎస్ఐ నాగరాజు తెలిపారు. ఎస్వీజీఎస్ కళాశాల మైదానంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ ని ఆయన ప్రారంభించారు.
ఇందుకూరుపేట మండలం నిడిముసలి గ్రామంలో శ్రీ చెన్నకేశవస్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బాలాయపల్లి మండలం గొట్టిపాడు ఎస్టీ కాలనీలో కిశోరి వికాసంపై శిక్షణా కార్యక్రమం జరిగింది. గ్రామ సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శి అనూ శ్రీ, అంగన్వాడి టీచర్ సుమతిలు కిశోరి వికాసంపై యువతులకు అవగాహన కల్పించారు.
ఇల్లందు మండలం జగదాంబ గుంపులో జై శ్రీరామ్ వే బ్రిడ్జిని పీఏసీఎస్ చైర్మన్ మెట్టల కృష్ణ ప్రారంభించారు. రైతుల కోసం వే బ్రిడ్జిని ఏర్పాటు చేయడం అభినందనీయమని నిర్వాహకుల్ని కొనియాడారు.
మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని తన తనయుడు, వెంకటగిరి వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నిర్వహించారు. వైసీపీ శ్రేణులతో కలిసి దివంగత నేదురుమల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ముత్తుకూరు మండలం మామిడిపూడి గ్రామంలో సాగులో ఉన్న కూరగాయల తోటలను నారాయణ కాలేజీ విద్యార్థులు పరిశీలించారు. స్థానిక వ్యవసాయ సహాయకులు శ్రీనివాసులు సహకారం సేంద్రియ వ్యవసాయం, లాభ నష్టాలు, డ్రిప్ తదితర అంశాల గురించి వారు అడిగి తెలుసుకున్నారు.