కార్యసాధకుడు నారాయణ మాస్టారు

భగత్ సింగ్ కాలనిలో అంబరాన్ని అంటిన సంబరాలు

మంత్రి నారాయణకి బ్రహ్మరథం పట్టి..పూల వర్షం కురిపించిన కాలనీ వాసులు

శాశ్వత ఇంటి పట్టాలకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించిన మంత్రికి మంగళ హారతులతో స్వాగతం

కార్యసాధకుడు నారాయణ మాస్టారు…

  • భగత్ సింగ్ కాలనిలో అంబరాన్ని అంటిన సంబరాలు
  • మంత్రి నారాయణకి బ్రహ్మరథం పట్టి..పూల వర్షం కురిపించిన కాలనీ వాసులు
  • శాశ్వత ఇంటి పట్టాలకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించిన మంత్రికి మంగళ హారతులతో స్వాగతం

యాంకర్ పార్ట్ :
నెల్లూరు నగరం భగత్ సింగ్ కాలనీలో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. కాలనీలోని ఇంటింటికెళ్లి తమకు శాశ్వత ఇళ్ల పట్టాలు మంజూరయ్యాయని శుభవార్త చెప్పారు. నారాయణ సార్ తామంతా మీకు ఆజన్మాంతం రుణపడి ఉంటామని చెప్పారు.

వాయిస్ వోవర్ :
భగత్ సింగ్ కాలనీ వాసులకి శాశ్వత ఇళ్ల పట్టాలకు కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల సమస్యకు మంత్రి నారాయణ పరిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ శుక్రవారం భగత్ సింగ్ కాలనీలో పర్యటించారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యను పరిష్కరించిన మంత్రి నారాయణకు కాలనీ వాసులు బ్రహ్మరధం పట్టి ,పూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మంత్రికి మంగళ హారతులతో స్వాగతం పలకి…గుమ్మడి కాయలతో తమ నేతకు ఆడపడుచుకులు దిష్టి తీశారు.
థాంక్యూ నారాయణ సార్ అంటూ ప్ల కార్డులు చేతబూని జేజేలు కొట్టారు. నారాయణ డోర్ టు డోర్ వెళ్లి శుభవార్త చెప్పారు.
14 వందల కుటుంబాలలో వెలుగులు నింపారని…మంత్రికి ఆజన్మాంతం రుణపడి ఉంటామని కాలనీ వాసులు చెప్పారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ…చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగానని గుర్తు చేశారు. పేదల కష్టాలు ,అవసరాలు నాకు తెలుసని,
అందుకే వారికి అండగా నిలవాలని నిర్ణయం తీసుకొని ముందుకు సాగుతున్నానని చెప్పారు. త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పట్టాలు పంపిణీ జరుగుతుందన్నారు. అనంతరం నుడా చైర్మన్ కోటంరెడ్డి మాట్లాడారు. భగత్ సింగ్ కాలనీ వాసుల కల నెరవేర్చిన నేతగా మంత్రి నారాయణ చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *