లక్ష్మీ నరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న హైకోర్టు జడ్జి పీ శ్రీసుధా
పెంచలకోనలో తెలంగాణ హైకోర్టు జడ్జి
- లక్ష్మీ నరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న హైకోర్టు జడ్జి పీ శ్రీసుధా
నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోనలో స్వయంభుగా వెలసి ఉన్న శ్రీ పెనుశిల లక్ష్మి నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో… తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి పి. శ్రీ సుధా కుటుంబ సమేతంగా స్వామి అమ్మవార్లను, ఆంజనేయస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకుల మంత్రోచ్ఛరణాలతో ఆశీర్వాదాన్ని, స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి కోర్ట్ జడ్జి విష్ణు వర్మ పాల్గొన్నారు.