సొంత నిధులతో గుంతలు పూడ్చిన ప్రశాంత్

మిగతాపనైన ఆర్ అండ్ బి శాఖ పూర్తి చేస్తుందని ఆశపడుతున్న

జీఎస్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు ప్రశాంత్

పూర్తిగా గుంతలు పూడ్చాలంటూ వాహనదారులు డిమాండ్

సొంత నిధులతో గుంతలు పూడ్చిన ప్రశాంత్…

  • మిగతాపనైన ఆర్ అండ్ బి శాఖ పూర్తి చేస్తుందని ఆశపడుతున్న జీఎస్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు ప్రశాంత్
  • పూర్తిగా గుంతలు పూడ్చాలంటూ వాహనదారులు డిమాండ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో దమ్మపేట సెంటర్ నుంచి శ్రీనివాస కాలనీ వరకు ఉన్న ప్రధాన రహదారిపై గుంతలు ఏర్పడి భయకరంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న జీఎస్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు ప్రశాంత్ తన సొంత నిధులతో గుంతలను పూడ్చారు. ఎవరూ కూడా రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకోకూడదన్న ఉద్దేశంతోనే గుడిపాడు యువత సహకారంతో గుంతలను సకాలంలో పూడ్చగలిగామని తెలిపారు. వాహనదారులు జాగ్రత్తలు పాటించి వాహనాలు నడపాలని ఆయన కోరారు. ప్రాణం పోతే తిరిగి రాదని ప్రశాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడిపాడు యువత కలోజీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *