రెడ్ క్రాస్ లో ఉచితంగా బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్స
నెల్లూరు రెడ్ క్రాస్ లో ముందస్తు తలసేమియా డే వేడుకలు
నూతనంగా 25 పడకల హాస్పిటల్ ప్రారంభించిన ప్రముఖ వైద్య నిపుణులు
ఇండియాలోనే పెద్ద ప్రాబ్లం తలసేమియా…
- రెడ్ క్రాస్ లో ఉచితంగా బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్స
- నెల్లూరు రెడ్ క్రాస్ లో ముందస్తు తలసేమియా డే వేడుకలు
- నూతనంగా 25 పడకల హాస్పిటల్ ప్రారంభించిన ప్రముఖ వైద్య నిపుణులు
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ ఛైర్మన్ వాకాటి విజయకుమార్ రెడ్డి సూచలన మేరకు… నగరంలోని రెడ్ క్రాస్ లో ముందస్తు తలసేమియా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రంలో ముఖ్య అతిధులుగా రెడ్ క్రాస్ నెల్లూరు జిల్లా శాఖ వైస్ ఛైర్మన్ చామర్తి జనార్ధన్ రాజు, కోశాధికారి సురేష్ కుమార్ జైన్, డాక్టర్ రమ్య, డాక్టర్ హరితలుు విచ్చేశారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన గావించి రెడ్ క్రాస్ ఫౌండేర్ హెన్రి డ్యూనాంట్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అరిపించారు. అనంతరం వైద్యులు మీడియాతో మాట్లాడారు. తలసేమియా బాధిత చిన్నారులకు రక్త మార్పిడి, వివిధ సేవలలో భాగంగా ఏడాదికి 1500 యూనిట్ల రక్తాన్ని, రెడ్ క్రాస్ ఉచితంగా అందిస్తుందన్నారు. తల సేమియా బాధిత చిన్నారులు వారి వైకల్యాన్ని అధిగమించి, అందరి చిన్నారుల్లా సాధారణ జీవితం గడపాలనే ఉద్దేశంతో సంకల్ప ఫౌండేషన్ సహకారంతో రెడ్ క్రాస్ ద్వారా వారికి 25 నుంచి 40 లక్షల రూపాయలు ఖర్చయ్యే బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్స ను ఉచితంగా చేయిస్తున్నామని తెలిపారు. చిన్నారులకు బోన్ మ్యారో చికిత్సలు అందించేందుకు రెడ్ క్రాస్ ఎల్లవేళలా ముందుతుందని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ తలసేమియా కొకన్వీనర్ ఎస్.కె.పర్వీన్, సెక్రెటరీ పి. మస్తానయ్య, రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వరప్రసాద్, స్పాస్టిక్ సెంటర్ ప్రిన్సిపాల్ గురునాథం, మైథిలి స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి.శశి ప్రియ, రెడ్ క్రాస్ మెంబర్స్, రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.