ల్యాంకో ఫౌండేషన్ వృద్ధాశ్రమం వద్ద బిల్డింగ్ ని సందర్శించిన
ఎంప్లాయిమెంట్ ఆఫ్ ట్రైనింగ్ డైరెక్టర్ గణేష్ కుమార్
సంగంలో ఐటీఐ కళాశాల ఏర్పాటు….
- ల్యాంకో ఫౌండేషన్ వృద్ధాశ్రమం వద్ద బిల్డింగ్ ని సందర్శించిన ఎంప్లాయిమెంట్ ఆఫ్ ట్రైనింగ్ డైరెక్టర్ గణేష్ కుమార్
నెల్లూరు జిల్లా సంగం మండలం అమరప నాయుడు కండ్రిక గ్రామంలోని ల్యాంకో ఫౌండేషన్ వృద్ధాశ్రమం వద్ద ఐటీఐ కళాశాల ఏర్పాటుకు ఎంప్లాయిమెంట్ ఆఫ్ ట్రైనింగ్ డైరెక్టర్ గణేష్ కుమార్ బిల్డింగ్ ను సందర్శించారు. తరగతి గదులు, వర్క్ షాపులకు బిల్డింగ్ అనువుగా ఉందా లేదా అని పరిశీలించారు. బిల్డింగ్ కి సంబంధించిన మ్యాప్ ను పరిశీలించి..మౌలిక వసతుల కల్పనకు తీసుకోవాలసిన చర్యలపై అధికారులతో చర్చించారు. మరమ్మతులు చేపట్టేందుకు ఎంత మేర నిధులు అవసరం అనే దానిపై అధికారులతో మాట్లాడారు. ఐటిఐ కళాశాలకు రహదారి వసతి పై చర్చించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బాణా శ్రీనివాసులురెడ్డి,అడిషనల్ డైరెక్టర్ బాల సుబ్రహ్మణ్యం,రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ నాగవర్ధన్ రాజు, ప్రిన్సిపల్ ఏడుకొండలు, ఏ ఈ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.