నాయుడుపేటలో పోలేరమ్మకి ప్రత్యేక పూజలు
అమ్మవారి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు
ఘనంగా ముగిసిన పోలేరమ్మ జాతర…
- అమ్మవారిని దర్శించి పరవశించిన భక్తులు
- అమ్మవారిని నిమజ్జనం చేసిన రజకులు
తిరుపతి జిల్లా నాయుడుపేట పోలేరమ్మ జాతర భక్తులు మొక్కులు, ఆచార సంప్రదాయాలు మధ్య వైభవంగా ముగిసింది. సాయంత్రం వరకు అమ్మవారిని భక్తులు దర్శించుకుని పరవశించిపోయారు. సాయంత్రం వినమాల నుంచి దున్నపోతుని పోలేరమ్మ చుట్టూ తిప్పారు. అనంతరం అమ్మవారిని విశ్రాంతి పీఠం వద్దకు మోసుకు వచ్చి విశ్రాంతి మందిరంలో ఉంచారు. బేరిపేట నుంచి వచ్చిన సఫరంపై అమ్మవారి నుంచి భక్తుల కోలాహలంతో పట్టణ వీధుల్లో ఊరేగుతూ ప్రజలకు పోలేరమ్మ దర్శనమిచ్చింది. రజకులు అమ్మవారిని చేతులపై మొసుకొని వెళ్లి నిమజ్జనం చేశారు. జై పోలేరి… జై పోలేరి అంటూ భక్తులు నినాదాలతో అమ్మవారి చివరి ఘట్టం ముగిసింది.