ఫీ మేనల్లుడు టిడిపి నేత ఫయాజ్ అనుమానం వ్యక్తం చేశారు
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి హత్యకు కారకులైన వారిని
కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించినా ఆశించిన ఫలితం దక్కడం లేదన్నారు
హత్యకేసును తప్పుదారి పట్టిస్తున్నారు…
- రఫీ మేనల్లుడు, టీడీపీ నేత ఫయాజ్ అనుమానం
పోలినాయుడు చెరువు గ్రామానికి చెందిన పెద్ద రఫీ హత్య కేసును తప్పుదారి పట్టిస్తున్నట్లు తమకు అనుమానాలు ఉన్నాయని రఫీ మేనల్లుడు టిడిపి నేత ఫయాజ్ అనుమానం వ్యక్తం చేశారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం పోలినాయుడు చెరువు గ్రామంలోని ఆయన నివాసంలో బంధువులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కేసు పురోగతిపై తమకు ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదని వాపోయారు. హత్యను ప్రోత్సహించిన వారిని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించినా ఆశించిన ఫలితం దక్కడం లేదన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా కేసును దర్యాప్తు చేసి హత్య వెనుక ఉన్న పెద్దలను శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. రఫీ హత్యలో భాగస్వామ్యం అయిన వారి వల్ల తమకు ప్రాణహాని ఉందని వెల్లడించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, జిల్లా ఎస్పీ చొరవ తీసుకొని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.