ఈ శ్రమ భీమా పథకాలకు దరఖాస్తు చేసుకోండి

16 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయస్సు కలిగిన వారు ఈ శ్రమ భీమా పథకం

వాకాడు ఎంపీడీవో శ్రీనివాసులు

ఈ శ్రమ భీమా పథకాలకు దరఖాస్తు చేసుకోండి

  • వాకాడు ఎంపీడీవో శ్రీనివాసులు

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత కార్మికులు, భవన నిర్మాణ కార్మికుల కోసం రెండు బీమా పథకాలు ప్రవేశ పెట్టాయని వాకాడు ఎంపీడీవో శ్రీనివాసులు తెలిపారు. 16 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయస్సు కలిగిన వారు ఈ శ్రమ భీమా పథకం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పథకానికి అసంఘటిత కార్మికులతో పాటు భవన నిర్మాణ కార్మికులు, పాడి పరిశ్రమ కార్మికులు, వ్యవసాయ కూలీలు, మత్స్యకారులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారు మరణిస్తే 2 లక్షల రూపాయలు బీమా ఇవ్వడం జరుగుతుందన్నారు. రెండో పథకం భవన నిర్మాణ కార్మికుల బీమా పథకం గురించి కూడా ఆయన వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *