వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ కళ్యాణ లక్ష్మి
జూలూరుపాడులో లబ్ధిదారులకి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం…
- వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ కళ్యాణ లక్ష్మి
- జూలూరుపాడులో లబ్ధిదారులకి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వేంగన్నపాలెంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో లబ్దిదారులకి సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ కళ్యాణ లక్ష్మి పాల్గొని లబ్దిదారులకి సీఎం సహాయ నిధి చెక్కులను అందచేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ…. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవానికి అండగా ఉంటుందని తెలిపారు. నిరుపేదలకు వైద్య ఖర్చుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఇంటి ఆడబిడ్డకి తమ ప్రభుత్వం తరఫున కానుక రూపంలో అందజేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ప్రభుత్వ అధికారులు, పార్టీ కార్యకర్తలు నాయకులు స్థానికులు పాల్గొన్నారు.