నష్టపరిహారం, పునరావాసం కల్పించాలి
సీపీఎం నేతలు డిమాండ్
52వ డివిజన్ రైలు వీధి ప్రాంతంలో బాధితుల్ని పరామర్శించిన నాయకులు
ఇల్లు తొలగిస్తే ఊరుకోం…
- నష్టపరిహారం, పునరావాసం కల్పించాలి
- సీపీఎం నేతలు డిమాండ్
- 52వ డివిజన్ రైలు వీధి ప్రాంతంలో బాధితుల్ని పరామర్శించిన నాయకులు
నెల్లూరు సిటీలో రైల్వే స్థలాలలో నివాసం ఉన్నవారిని నష్టపరిహారం,పునరావాసం కల్పించకుండా తొలగిస్తామని చెప్పడం తగదని సీపీఎం నేతలు తెలిపారు. 52వ డివిజన్ పరిధిలోని రైలు వీధిలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు పర్యటించి బాధితులను పరామర్శించారు. స్థానికులు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మూలం రమేష్, కత్తి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఏ ప్రభుత్వ స్థలంలో నివాసం ఉన్నప్పటికీ వారికి నష్టపరిహారం, పునరావాసం కల్పించకుండా ఇల్లు తొలగించకూడదన్నారు. 100 సంవత్సరాలకు పైగా నివాసమున్న వారిని దౌర్జన్యంగా తొలగిస్తామంటే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు జి. నాగేశ్వరావు, నగర కమిటీ సభ్యులు షేక్. రషీద్, చిరంజీవి, శాఖ కార్యదర్శులు అమాన్, మట్టిపాటి శ్రీనివాసులు, సిపిఎం నాయకులు అలీ, అఖిల్ గణేష్ పాల్గొన్నారు.