నెల్లూరు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్ ఆనంద్
ప్రజాసమస్యలకు తక్షణమే పరిష్కారం
- నెల్లూరు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్ ఆనంద్
ప్రజాసమస్యలకు తక్షణమే పరిష్కారం చూపించాల్సిన బాధ్యత ఆయా శాఖల అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ ఆనంద్ అన్నారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ ఆనంద్ పాల్గొని ప్రజల వద్ద నుంచి సమస్యలపై వచ్చిన అర్జీలను స్వీకరించారు. అర్జీదారులతో కలెక్టర్ మాట్లాడి కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ ఉదయభాస్కర్, జెడ్పి సిఇఒ విద్యారమ, డిపిఒ శ్రీధర్ రెడ్డి, డ్వామా పిడి గంగా భవాని ఇతర అధికారులు పాల్గొన్నారు.