ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ఎప్ప‌టిక‌ప్పుడే స‌మ‌స్య‌లు ప‌రిష్కారం

నెల్లూరు కార్పొరేష‌న్ కార్యాల‌యంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక‌

ప్ర‌జ‌ల వ‌ద్ద నుంచి అర్జీల‌ను స్వీక‌రించిన‌ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు

ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ఎప్ప‌టిక‌ప్పుడే స‌మ‌స్య‌లు ప‌రిష్కారం

  • నెల్లూరు కార్పొరేష‌న్ కార్యాల‌యంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక‌
  • ప్ర‌జ‌ల వ‌ద్ద నుంచి అర్జీల‌ను స్వీక‌రించిన‌ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు

నిర్ధేశించిన స‌మ‌యంలోపు స‌మ‌స్య‌ల‌పై వ‌చ్చిన అర్జీదారుల‌ను ప‌రిష్కార‌మార్గం చూపాల‌ని నెల్లూరు డిప్యూటీ క‌మిష‌న‌ర్ చెన్నుడు తెలిపారు. నెల్లూరు న‌గ‌ర‌పాల‌క సంస్థ కార్యాల‌యంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్య‌క్ర‌మం జ‌రిగింది. డిప్యూటీ కమిషనర్ చెన్నుడు పాల్గొని అర్జీదారుల నుంచి వినతుల‌ను స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని స్థానిక సమస్యలను ఎప్ప‌టిక‌ప్ప‌డు ప‌రిష్క‌రించేందుకు ప‌క్కా ప్ర‌ణాళిక‌లు చేప‌డుతున్న‌ట్లు తెలిపారు. కమాండ్ కంట్రోల్ విభాగంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కి ఫోన్ ద్వారా తెలియజేస్తే తక్షణమే స్పందించి ఫిర్యాదును పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ అంశాలపై ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం అందిస్తున్న‌ట్లు చెప్పారు. ఈ క్ర‌మంలో ప‌లు స‌మ‌స్య‌ల‌పై 54 అర్జీలు అందిన‌ట్లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం సిటీ ప్లానర్ పద్మజ, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చైతన్య, ఇంజనీరింగ్ ఈ.ఈ శేషగిరి రావు, మేనేజర్ ఇనాయతుల్లా ఇతర అన్ని విభాగాల అధికారులు, సూపరెంటెండెంట్ లు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *