పార్కుల అభివృద్ధిని అటకెక్కించిన వైసీపీ
రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖమంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ
నెల్లూరు 52వ డివిజన్లో అధునాతన వసతులతో తిక్కనపార్కు ప్రారంభం
ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్న పార్కుల్లో పిల్లల కేరింతలు
రాష్ట్రంలోని అన్నీ పార్కులను అభివృద్ధి చేస్తాం
- పార్కుల అభివృద్ధిని అటకెక్కించిన వైసీపీ
- రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖమంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ
- నెల్లూరు 52వ డివిజన్లో అధునాతన వసతులతో తిక్కనపార్కు ప్రారంభం
- ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్న పార్కుల్లో పిల్లల కేరింతలు
నెల్లూరు 52 వ డివిజన్లో 30 లక్షలతో ఆధునీకరించిన తిక్కన పార్కులో ప్లే, జిమ్ ఎక్విప్మెంట్ లను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రారంభించారు. నారాయణ రాకతో పార్కు వద్ద సందడి వాతావరణం నెలకొంది. వేదపండితుల పూర్ణకుంభ స్వాగతం.. మహిళల కోలాటం… పార్టీ శ్రేణుల ఆత్మీయ పలకరింపులు, ముస్లీంసోదరుల ప్రత్యేక ప్రార్థనలు, మంగళ వాయిద్యాలు, బాణాసంచాల మోతతో జాతర వాతావరణంలో మంత్రి పార్కును లాంఛనంగా ప్రారంభించారు. ఈ క్రమంలో పార్కు పక్కనే నివాసం ఉన్న పార్టీ కార్యకర్త గోవిందమ్మ ఇంట్లో మంత్రి నారాయణ అల్పాహారం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ 2018 లోనే 100 పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని తెలిపారు. అయితే అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్కుల అభివృద్ధిని అటకెక్కించిందని దుయ్యబట్టారు. ప్రజారోగ్య పరిరక్షణతో పాటు, పిల్లలకి ఆహ్లాదం కోసం పార్కులను ఆధునీకరిస్తున్నామని మంత్రి తెలిపారు. పార్కుల్లో పిల్లల కేరింతలు, సంతోషాన్ని చూస్తే ఆనందంగా ఉందని, ఇదేమాదిరిగా రాష్ట్రంలోని పార్కులన్నీ ఆధునీకరిస్తామన్నారు. అన్ని పార్కుల్లో 365 డిగ్రీస్ లో సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.