అమృత్ పథకం పైలాన్ ధ్వంసం కేసులో 12 మంది పేర్లు నమోదు
ఇప్పటికే నలుగురు విలేకరులు అరెస్ట్… రిమాండ్
కావలిలో సంచలనంగా మారిన నాటి పైలాన్ ధ్వంసం కేసు
కావలి మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
- అమృత్ పథకం పైలాన్ ధ్వంసం కేసులో 12 మంది పేర్లు నమోదు
- ఇప్పటికే నలుగురు విలేకరులు అరెస్ట్… రిమాండ్
- కావలిలో సంచలనంగా మారిన నాటి పైలాన్ ధ్వంసం కేసు
నెల్లూరు జిల్లా కావలిలో అమృత్ పథకం పైలాన్ ధ్వంసం కేసు సంచలనంగా మారింది. 11/4/2020 లో నాటి కమిషనర్ కె. వెంకటేశ్వర రావు ఇచ్చిన పిర్యాదు నేడు తెరపైకి వచ్చింది. ఈ కేసును విచారించిన కావలి రెండో పట్టణ సీఐ గిరిబాబు పైలాన్ ధ్వంసం చేసిన ఘటనలో 12 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ఏ వన్ గా సాక్షి కావలి విలేకరి కుర్రు శ్రీనివాసులు అలియాస్ కేఎస్, A2 గా మాజీ విశాలాంధ్ర విలేకరి కేదారి మాలకొండయ్య,
A3 గా సుపథ మీడియా మాజీ విలేకరి బెహరా నారాయణ, మాజీ విలేకరులు A4 గా వేనంబడి ప్రసాద్, A5 గా శ్రావణ్ కుమార్, A6 గా జ్యోతి అనీల్ కుమార్, A7 గా 10 టీవీ రిపోర్టర్ వెంకట్రావులు ఉన్నారు. అదేవిధంగా A8 గా కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, A9 గా కావలి ఏ ఎంసీ మాజీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి, A10 గా వైసీపీ నాయకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, A11గా వైసీపీ కావలి పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, వైసీపీ నాయకుడు చెన్ను ప్రసాద్ రెడ్డి లు మరియు కొంతమంది వైసీపీ నాయకులు, విలేకరులు ఉన్నట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆదివారమే ఈ కేసులోని A1, A2, A3, A4 లను అరెస్ట్ చేయగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.