రూ. 3.5 లక్షల విలువ చేసే 2 బైకులు స్వాధీనం
కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్
దొంగ అరెస్ట్…
- రూ. 3.5 లక్షల విలువ చేసే 2 బైకులు స్వాధీనం
- కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం పొగరుపల్లి క్రాస్ వద్ద వాహనాల తనిఖీల్లో చేస్తుండగా దొంగ పోలీసులకు పట్టబడ్డాడు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా సుమారు 3.5 లక్షల విలువ చేసే 2 ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నాడు. రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్ తెలిపారు..