పహల్గాం ఉగ్రదాడి మృతుడు కావలి వాసి మధుసూధన్ రావు కుటుంబాన్ని
పరామర్శించిన సినీ నటుడు మంచు విష్ణు
మీడియాతో మాట్లాడేందుకు నిరాకరణ
ఉగ్రదాడి బాధిత కుటుంబానికి మంచు విష్ణు పరామర్శ
- పహల్గాం ఉగ్రదాడి మృతుడు కావలి వాసి మధుసూధన్ రావు కుటుంబాన్ని పరామర్శించిన సినీ నటుడు మంచు విష్ణు
- మీడియాతో మాట్లాడేందుకు నిరాకరణ
పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన కావలి వాసి మధుసూధన్ రావు కుటుంబాన్ని సినీ నటుడు మంచు విష్ణు శుక్రవారం పరామర్శించారు. కావలి పట్టణానికి వచ్చిన ఆయన ఉగ్రదాడి బాధిత కుటుంబ నివాసానికి వెళ్ళి వారితో మాట్లాడారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. జరిగిన ఘటనపై స్పందించాలని విలేకరులు కోరారు. దీంతో ఆయన స్పందిస్తూ వచ్చాను, పరామర్శించానన్నారు. వారి కుటుంబానికి మీరేమైనా బరోసా ఇచ్చారా అని ప్రశ్నించగా నేను ఏమిమాట్లాడానో నాకు వారి మధ్యే ఉంది అంటూ వెళ్ళిపోయారు.