ఆత్మకూరులో ఇంజనీరింగ్ కాలేజీ..

సోమశిల నీరు ఆత్మకూరుకి ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిది

దగదర్తిలో త్వరలోనే ఎయిర్ పోర్టు పనులు ప్రారంభించి, త్వరగా పూర్తి చేస్తాం

ఆత్మకూరు ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

ఆత్మకూరులో ఇంజనీరింగ్ కాలేజీ…

  • సోమశిల నీరు ఆత్మకూరుకి ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిది
  • దగదర్తిలో త్వరలోనే ఎయిర్ పోర్టు పనులు ప్రారంభించి, త్వరగా పూర్తి చేస్తాం
  • ఆత్మకూరు ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

ఆత్మకూరులో ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఆత్మకూరుకి విచ్చేసిన సీఎంకి రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ క్రిష్టకాంత్, నియోజకవర్గ ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు అందచేశారు. నారంపేటలో APIIC MSME పార్కుని చందద్రబాబు ప్రారంభించారు. మేడే సందర్భంగా కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం ప్రజా వేదికలో సీఎం చంద్రబాబునాయుడు ప్రసంగించారు… సోమశిల నీరు ఆత్మకూరుకి ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదని చెప్పారు. దగదర్తిలో త్వరలోనే ఎయిర్ పోర్టు పనులు ప్రారంభించి, త్వరగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడకి వెళ్లినా, నా రాజధాని అమరావతి అని చెప్పుకోవాలన్నారు. మండలానికో MSME పార్కు తీసుకురావాలన్నది మా లక్ష్యమన్నారు. కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు, ప్రజలు, కార్మికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *