నన్ను కాపాడండి టీచర్

30 ఏళ్ల వ్యక్తితో ఏడో తరగతి బాలికకు వివాహం

తల్లిదండ్రుల బలవంతంతోనే పెళ్లి

కోటలో అమానుష ఘటన

నన్ను కాపాడండి టీచర్…

  • 30 ఏళ్ల వ్యక్తితో ఏడో తరగతి బాలికకు వివాహం
  • తల్లిదండ్రుల బలవంతంతోనే పెళ్లి
  • కోటలో అమానుష ఘటన

వేసవి సెలవులకు ఇంటికి వస్తే.. బలవంతంగా పెళ్లి చేసేశారు…. కన్నవాళ్లు కూడా కాపురం చేయాల్సిందే అంటున్నారు. నన్ను కాపాడండి’ అంటూ ఏడో తరగతి బాలిక ఏడుస్తూ టీచర్లను వేడుకున్న ఘటన… తిరుపతి జిల్లా కోట చోటు చేసుకుంది. బాధితురాలి వివరాల మేరకు… కోట మండలం గూడలి సమీపంలోని కాలనీలో నివసిస్తున్న ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అక్కాచెల్లెళ్లు.. కోట గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో 7, 9 తరగతులు చదువుతున్నారు. వేసవి సెలవులు ఇవ్వడంతో ఏప్రిల్ 23న ఇంటికి వెళ్లారు. ఆ రాత్రే ఇద్దరికీ తల్లిదండ్రులు పెళ్లి కుదిర్చేశారు. మరుసటి రోజే పెళ్లిళ్లు చేసేసి భర్తల వెంట పంపేశారు. 30 ఏళ్ల వ్యక్తికి 7వ తరగతి బాలికను ఇచ్చి పెళ్లి చేయడంతో.. ఆ బాలిక కాపురం చేయలేను అంటూ పుట్టింటికి వచ్చేసింది. తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా.. పసుపు తాడుతోనే బుధవారం గురుకుల పాఠశాలకు వెళ్లిపోయింది. తనను కాపాడమంటూ టీచర్ల కాళ్లా వేళ్లా పడింది. వెంటనే వారు పోలీసులకు, ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఐసీడీఎస్ సీడీపీఓ మునికుమారి, సూపర్వైజర్ కవిత పోలీసులకు ఫిర్యాదు చేసి, బాలికను నెల్లూరులోని బోర్డింగ్ స్కూల్ (బాలసదన్)కు తరలించారు. ఈ సందర్భంగా మునికుమారి మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *