వైసీపీ కార్యాలయంలో మేడే వేడుకలు

వైఎస్ఆర్టీయూసీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో కేక్ కటింగ్, జెండా ఆవిష్కరణ

YSRTUC జెండాను ఆవిష్కరించిన వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు

వైసీపీ కార్యాలయంలో మేడే వేడుకలు…

  • వైఎస్ఆర్టీయూసీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో కేక్ కటింగ్, జెండా ఆవిష్కరణ
  • YSRTUC జెండాను ఆవిష్కరించిన వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు

నెల్లూరు పొదలకూరురోడ్డు సాయిరాం నగర్ లోని…జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో… YSRTUC జిల్లా అధ్యక్షుడు ఆనం విజయ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో వైసీపీ నియోజకకవర్గ సమన్వయకర్తలు ఆనం విజయకుమార్ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి, వైసీపీ ముఖ్య నేతలు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా YSRTUC జండా ఆవిష్కరించి మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి…కార్మికులందరికి మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆనం విజయకుమార్ మీడియాతో మాట్లాడుతూ… ఎందరో కార్మికుల పోరాట, త్యాగ ఫలితమే నేడు మనమందరం కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని చెప్పారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే కార్మికులకు అండగా ఉండే అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *