అమరావతి సభా వేదిక కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రుల కమిటీ సమావేశం
నారాయణ, కేశవ్, కొల్లు రవీంద్ర, మనోహర్
మోదీ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి…
- అమరావతి సభా వేదిక కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రుల కమిటీ సమావేశం
- నారాయణ,కేశవ్,కొల్లు రవీంద్ర,మనోహర్
మే 2న అమరావతిలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్న నేపథ్యంలో… సభా వేదిక వెనుక ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్లో రాష్ట్ర మంత్రులు నారాయణ,కేశవ్,కొల్లు రవీంద్ర,మనోహర్ కమిటీ సమావేశం నిర్వహించారు. పర్యవేక్షణ అధికారులతో కలసి సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ సభకు చేరుకునే మార్గాలు, పార్కింగ్ స్థలాలు,ఆహారం,తాగునీరు,వేదిక వద్ద ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లు ఇతర అంశాలపై అధికారులు, మంత్రులు సుదీర్ఘగంగా చర్చయించారు. ప్రధానమంత్రి పర్యటనకు దాదాపు ఏర్పాట్లు పూర్తయినట్లు మంత్రులు పేర్కొన్నారు. ప్రధాని పర్యటనలో ఎక్కడా ఎలాంటి చిన్న ఇబ్బంది కూడా తలెత్తకుండా అధికారులు, ప్రజా ప్రతినిధులందరూ సమన్వయంతో పని చేయాలని మంత్రులు ఆదేశించారు.