నియోజకవర్గాల్లో ఎర్ర జెండాలు ఆవిష్కరణ
పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
కొత్తగూడెంలో మేడే సంబరాలు…
- నియోజకవర్గాల్లో ఎర్ర జెండాలు ఆవిష్కరణ
- పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వరావుపేట, పినపాక,భద్రాచలం,కొత్తగూడెం, ఇల్లందు నియోజకవర్గాల్లో మేడే వేడుకలను కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ఘనంగా జరుపుకున్నారు. జెండాలను ఆవిష్కరించి వర్ధిల్లాలి మేడే అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని ప్రసంగించారు. కార్మిక సోదరులందరికి కార్మిక దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. ఎందరో కార్మికుల ప్రాణ త్యాగ ఫలితమే నేడు మేడే అని తెలిపారు. కార్మికులందరికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.