శంఖుస్థాపన ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేని ఆహ్వానించకపోవడంపై ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర కోశాధికారి కొర్సా ఫైర్
అధికారుల్ని వెంటనే సస్పెండ్ చేయాలి…
- శంఖుస్థాపన ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేని ఆహ్వానించకపోవడంపై ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర కోశాధికారి కొర్సా ఫైర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుకుంట మారుమూల ఆదివాసి గుడాలల్లో జరిగిన 15 కోట్లు రూపాయలు హై లెవెల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణను సంబంధిత అధికారులు ఆహ్వానించకపోవడం దివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర కోశాధికారి కొర్సా వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం ప్రజల కోసం పని చేసే శాసన సభ్యుడుని మరచిపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమన్నారు. ఎమ్మెల్యేకి జరిగిన అవమానంపై యావత్తు ఆదివాసి జాతి మండిపడుతుందన్నారు. వెంటనే అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని వెంకటేష్ హెచ్చరించారు. తన నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాటమ్లాడారు.