ఎన్‌3న్యూస్ బుల్లెట్స్‌

సంక్షిప్త వార్త మాలిక‌

నెల్లూరు దర్గామిట్ట, ప్రగతి నగర్ మెయిన్ రోడ్డులో పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ వ్యవస్థాపకులు కోగిలి రమేష్ రాజ్, వారి మిత్రబృందం ఆధ్వర్యంలో మజ్జిగ, మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని దర్గామిట్ట సీఐ రోశయ్య ప్రారంభించిన మిత్ర బృందాన్ని అభినందించారు.

నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన దివ్యాంగుల క్రికెట్ క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం జరిగింది. దివ్యాంగులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని సత్తా చాటారు. దివ్యాంగులు మొక్కువోని పట్టుదలతో క్రికెట్ లో రాణించడం అభినంద‌నీయ‌మ‌ని వక్తలు కొనియాడారు.

కొడవలూరు మండలం నార్త్ రాజుపాళెం జాతీయ రహదారి ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ పై వెళుతున్న ఇద్దరు స్నేహితుల్ని లారీ వైనుక వైపు నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో మిత్రులందరూ స్పాట్ లో దుర్మరణం చెందారు.

గూడూరులో వెలసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు స్వామి, అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి తరించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని దేస్తావేజు లేఖర్లు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్టాట్ బుకింగ్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.

వెంకటగిరిలోని ఓ ఫంక్షన్ హాల్ లో బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు సమావేశమయ్యారు. బీసీలకి రాష్ట్ర ప్రభుత్వం ప్రాముఖ్యత కల్పించాలని వారు కోరారు.

కుప్పంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ జన్మదిన వేడుకలను టిడిపి నేతలు ఘనంగా జరుపుకున్నారు. శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయంలో పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాపూరు మండలం ఇరిగేషన్ శాఖలో ఈఈగా పని చేస్తోన్న షేక్ సర్ధార్ వైఎస్ఆర్ కడప జిల్లా ఇరిగేషన్ శాఖ డీఈగా పదోన్నతి పొందారు. ఆయన సేవల్ని అధికారులు, తోటి ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, మిత్రులు కొనియాడారు. భవిష్యత్ లో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *