అడ్డుకున్న నుడా ఛైర్మన్ కోటంరెడ్డి
రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించని అధికారులు
మూడు గంటలపాటు పెన్నలోనే బైఠాయించిన శ్రీనివాసులురెడ్డి
పెన్నలో ఇసుక దోపిడీ
-అడ్డుకున్న నుడా ఛైర్మన్ కోటంరెడ్డి
-రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించని అధికారులు
-మూడు గంటలపాటు పెన్నలోనే బైఠాయించిన శ్రీనివాసులురెడ్డి
నెల్లూరు రూరల్ పరిధిలోని దీన్దయాళ్ నగర్లోని పెన్నానదిలో గత కొంత కాలంగా అక్రమంగా ఇసుక రవాణా జరుగుతోంది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటలవరకు పెద్ద ఎత్తున టిప్పర్లతో అక్రమంగా ఇసుకను తరలిస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయమై స్థానికులు అనేక సార్లు సంబంధిత అధికారులకు సమాచారం అందించినా.. ఎవరూ పట్టించుకోలేదు.దాంతో కొందరు యువకులు, స్థానికులు సోమవారం రాత్రి 11 గంటల సమయంలో రెండు టిప్పర్లను అడ్డుకున్నారు. ఈవిషయాన్ని నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో.. ఆయన రంగ ప్రవేశం చేశారు. నేరుగా పెన్నా నదివద్దకు వెళ్లి.. పట్టుబడ్డ టిప్పర్ల డ్రైవర్లతో మాట్లాడారు. టిప్పర్ల వివరాలు, ఎప్పటి నుంచి అక్రమ రవాణా చేస్తున్నారంటూ వారిని నిలదీశారు. వారి నుంచి పొంతన లేని సమాధానాలు రావడంతో ఈవిషయమై చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసులు, మైనింగ్, రెవెన్యూ అధికారులకు తానే స్వయంగా ఫోన్చేసి.. సమాచారం అందించారు. అయినా.. ఎవరూ స్పందించలేదు. అర్ధరాత్రి దాటినా.. ఏ అధికారి కూడా సంఘటనా స్థలానికి రాకపోవడంతో..ఇక ఆయనే.. అధికారులు దిగి వచ్చేవరకు.. కదిలేది లేదంటూ.. అక్కడే భీష్మించి బైఠాయించారు. ఈవిషయం దావానంలా వ్యాపించడంతో రూరల్ సీఐ వేణు, రూరల్ తహసీల్దారు లాజరస్లు తీరిగ్గా.. రెండు గంటల ప్రాంతంలో అక్కడకు చేరుకున్నారు. ఎందుకు త్వరతిగతిన స్పందించలేదంటూ కోటంరెడ్డి నిలదీసినా.. వారి నుంచి సరైన సమాధానం రాలేద. ఇది తమ పరిధికాదనుకున్నామని.. అర్భన్ అనుకున్నామంటూ సాకులు చెప్పే యత్నం చేశారు. అధికార పార్టీకి చెందిన కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి.. నుడా ఛైర్మన్ హోదాలో సమాచారం ఇచ్చినా.. అధికారుల నుంచి స్పందన లేకపోవడంపై తీవ్రమై చర్చ జరుగుతోంది.