మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తాం మంత్రి నారాయణ
అమరావతిలో ప్రధాని ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించిన మంత్రి నారాయణ
ప్రధాని చేతుల మీదుగా అమరావతి పున: ప్రారంభం
- మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తాం
- మంత్రి నారాయణ
- అమరావతిలో ప్రధాని ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించిన మంత్రి నారాయణ
మే 2 న సాయంత్రం 3.25 కి ప్రధాని అమరావతి విచ్చేస్తున్నారని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా అమరావతిలోని ప్రధాని ఏర్పాట్లను అధికారులతో కలిసి సందర్శించారు. అలాగే సభా వేదిక,పార్కింగ్ ప్రాంతాలు,వేదిక వద్దకు చేరుకునే మార్గాలు ఆయన పరిశీలించారు. ప్రధాని పర్యటనకు సంబంధించి 90 శాతం పనులు పూర్తయ్యాయని…రేపటికల్లా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ….అమరావతి రాజధాని పునఃప్రారంభం ప్రధాని చేస్తారని…మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.