ఎన్3న్యూస్ బుల్లెట్స్‌

సంక్షిప్త వార్త మాలిక‌

నెల్లూరులోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మే 1న ఆత్మకూరులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన ఏర్పాట్లు తదితర విషయాలపై ఇరువురు సుదీర్ఘగంగా చర్చించారు.

ఉగ్రవాదుల దాడికి నిరసనగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో బీజేపీ నేతలు బంద్ నిర్వహించారు. మండలంలోని దుకాణాలన్నింటిని వారు మూయించి వేశారు. త్వరలోనే పాకిస్తాన్ కి భారతదేశం తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు.

ఇందుకూరుపేట మండలం రావూరు కండ్రిగ రోడ్డు పక్కన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ నాగార్జున రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో క్యూ లైన్లో భక్తులకి అధికారులు మజ్జిగ పంపిణీ చేశారు. భక్తులకు మజ్జిగ అందించడంలో మాజీ ఆలయ ట్రస్ట్ సభ్యురాలు పద్మజ సహకారాన్ని అందించారని ఆలయ సహాయ కమిషనర్ తెలిపారు.

కావలి మండలంలో రూరల్ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా గ్రావెల్ తరలిస్తోన్న నాలుగు భారీ టిప్పర్లు, ఒక జేసీబీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రాజేశ్వరరావు తెలిపారు.

ఎస్సీ కార్పొరేషన్ రుణాలు యువతకి ఎంతో ఉపయోగపడుతాయని వింజమూరు ఎంపీడీవో శ్రీనివాసులురెడ్డి తెలిపారు. మండలానికి మొత్తం 14 యూనిట్లు మంజూరు అయ్యాయని ఆయన చెప్పారు.

చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఆరో వార్డ్ కౌన్సిలర్ సెల్వ రాజ్ చైర్మన్ ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. దీంతో నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు పెద్ద సంబరాలు చేసుకున్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడి పథకాల ఉపయోగాలను వివరించారు.

రాపూరులోని ఆర్డీసీ డిపో ఎదుట ఉద్యోగులు రిలే దీక్ష చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో దీక్షని ఉద్రుతం చేస్తామని హెచ్చరించారు.

ఆత్మకూరులో జనసేన పార్టీ నాయకులు డొక్కా సీతమ్మ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. డొక్కా సీతమ్మ వర్ధంతి సందర్భంగా చలివేంద్రాన్ని ప్రారంభించడం హర్షణీయమని నాయకులు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో డొక్కా సీతమ్మ పేరుతో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు.

సైదాపురంలో మండలం చాగణం రాజుపాళెంలో తెల్లరాయి అక్రమ రవాణాపై ఎస్ఐ క్రాంతికుమార్ తన సిబ్బందితో ఆకస్మిక దాడులు చేశారు. దాడుల్లో ఓ ట్రాక్టర్ ని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించినట్లు ఆయన తెలియజేశారు. అక్రమార్కులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

వాకాడు ఏపీఎస్ ఆర్టీసీ డిపో ఆవ‌ర‌ణంలో..నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో.. ఎర్ర బ్యాడ్జీల‌తో రెండు రోజులు నిరాహార‌దీక్ష చేప‌ట్టారు. ఆర్టీసీ ఉద్యోగ‌, కార్మికుల స‌మస్యలు ప‌రిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారంతో…18వ డివిజన్ లో 3 కోట్ల 62 లక్షలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని డివిజన్ కార్పొరేటర్ అశోక్ నాయకుడు తెలిపారు. హరనాథపురంలోని పీపుల్స్ పార్క్ వద్ద స్థానిక నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు అనుచిత దూషణలు.. బెదిరింపులను సీపీఎం నాయకులు తీవ్రంగా ఖండించారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలో నిరసన ర్యాలీ చేపట్టారు. రఘురామా నీ బెదిరింపులకు భయపడేది లేదని హెచ్చరించారు.

పొదలకూరులోని శ్రామిక నగర్ లో డొక్కా సీతమ్మ వర్ధంతి సందర్బంగా జనసేన నేతలు చలివేంద్రాన్ని ప్రారంభించారు. సర్వేపల్లి జనసేన పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు పాల్గొని పేదలకు మజ్జిగ, బిస్కెట్లు పంపిణీ చేశారు.

స్పౌజ్ పెన్షన్లకు అర్హులైన లబ్దిదారులందరూ దరఖాస్తు చేసుకోవాలని సైదాపురం ఎంపీడీవో శివకుమార్ తెలిపారు. మండలంలో 115 మందికి మంజూరయ్యాయని ఆయన చెప్పారు. తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మల్లారం రైతు వేదికలో భూ భారతి చట్టంపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సు జరిగింది. సదస్సులో కలెక్టర్ జితేశ్ వి పాటల్, ఎమ్మెల్యే జారే ఆదినారాయణలు పాల్గొని…భూ భారతి చట్టంపై రైతులకి అవగాహన కల్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *