నేటి వార్త మాలిక‌

క‌ల్తీ లేని వార్తలు క‌ల‌క‌లం రేపే క‌థ‌నాలు

అక్టోబరు 2 నాటికి రాష్ట్రంలో ఉన్న చెత్తనంతా తొలగించాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. విజయవాడలో స్వచ్చాంద్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో కెపాసిటీ బిల్డింగ్,బిహేవియరల్ చేంజ్ పై ఒక రోజు వర్క్ షాప్ లో మంత్రి పాల్గొని ప్రసంగించారు.

కావలిలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తహశీల్దార్ శ్రావణ్ కుమార్, ఒకరిద్దరు అధికారులు తప్పా మిగతా అందరూ డుమ్మా కొట్టారు. దీనిపై ఎన్3 న్యూస్ ప్రతినిధి మండల రెవెన్యూ కార్యాలయంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. కలెక్టర్ స్పందించి పరిష్కార వేదికపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని అర్జీదారులు కోరుతున్నారు.

కావలి సీనియర్ రాజకీయ నాయకుడు, డీబీఎస్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ దామిశెట్టి శ్రీనివాసులు నాయుడు కుటుంబ సభ్యులను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో కలిసి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరామర్శించారు. శ్రీనివాసులు నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజకీయాల్లో శ్రీనివాస నాయుడుతో అనుబంధాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

నెల్లూరుకలెక్టరట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ కే కార్తీక్ నిర్వహించారు. అర్జీదారుల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. ప్రతీ అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని అధికారుల్ని జేసీ ఆదేశించారు.

కావలి మండలంలో రెండో కారు పంటకు సాగునీరు అందదని, ఎవరూ సాగు చేయవద్దని మండల ఇరిగేషన్ ఏఈ కిరణ్ తెలిపారు. ఇరిగేషన్ కార్యాలయంలో నీటి కేటాయింపుల సాధ్య సాధ్యాలపై ఇరిగేషన్ అధికారులు, నీటి సంఘాల అధ్యక్షులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కావలి, ఉదయగిరి ఎమ్మెల్యేలు కావ్య కృష్ణారెడ్డి కాకర్ల సురేష్ దృష్టికి తీసుకెళ్లి తదుపరి నీటి కేటాయింపులు వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్శిటీలో ఏప్రిల్ 30 నుంచి 8వతేదీ వరకు ఆల్ ఇండియా ఇంట‌ర్ వ‌ర్సిటీ సాఫ్ట్‌బాల్ మెగా టోర్నీ జరుగుతుందని వీసీ రిజిస్టర్ సునీత తెలిపారు. టోర్నీలో 94 ఉమెన్ జ‌ట్లు.. 97 పురుషుల జ‌ట్లు పాల్గొననున్నాయన్నారు. వర్శిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు.

ముత్తుకూరు మండలం పిడతాపోలూరులోని సచివాలయం ఆవరణలో న్యాయ న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ సదస్సులో జిల్లా సీనియర్ సివిల్ జడ్జి వాణి పాల్గొని పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కేసు ఏ స్థాయిలో ఉన్నా లోక్ అదాలత్ లో సత్వర న్యాయం అందుతుందని జడ్జి తెలిపారు.

దగదర్తి ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ పెంచలయ్య తొలగింపుపై టిడిపి రాష్ట్ర కార్యదర్శి మాలేపాటి సుబ్బానాయుడు, ఆయన సోదరుడు రవీంద్ర నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయానికి చేరుకొని
ఎంపిడిఓ వెంకటేశ్వర్లు, ఏపీవో అచ్చయ్యలను నిలదీశారు. ఒక కరుడుగట్టిన వైసీపీ నేత చెబితే పనులు పెడతానని ఏపీవో చెప్పడం ఏమిటని నిలదీశారు.

నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. బాధితుల నుంచి వారు అర్జీలు స్వీకరించారు. పరిష్కార వేదికకు మొత్తం 115 అర్జీలు అందాయని వారు తెలియజేశారు. ప్రతీ అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని అధికారులు, సిబ్బంది ఆదేశించారు

నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కమిషనర్ వైవో నందన్ నిర్వహించారు. అర్జీదారుల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. మన మిత్రని ప్రజలందరకూ సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *