ఎస్పీ గ్రీవెన్స్ కి 115 ఫిర్యాదులు

అర్జీలు స్వీకరించిన పోలీసు అధికారులు

ఎస్పీ గ్రీవెన్స్ కి 115 ఫిర్యాదులు…

  • అర్జీలు స్వీకరించిన పోలీసు అధికారులు

జిల్లా యస్. పి. కృష్ణ కాంత్ ఆదేశాల మేరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని… నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం పోలీసు అధికారులు నిర్వహించారు. ఈ సందర్బంగా వారు బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాదిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వేదికకి వచ్చే ప్రతీ అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని అధికారులు, సిబ్బంది ఆదేశించారు. వేదిక కార్యక్రమానికి మొత్తం 115 ఫిర్యాదులు వచ్చాయని తెలియజేశారు. కార్యక్రమంలో DTC DSP గిరిధర్ , ఉమెన్ PS DSP చెంచు రామారావు , లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులు రెడ్డి , SB-2 CI శ్రీనివాసరెడ్డి, కంప్లైంట్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *