విక్రమ సింహపురి యూనివర్సటీలో ఏప్రిల్ 30 నుంచి మే 8వరకు
ఆల్ ఇండియా ఇంటర్ వర్సిటీ సాఫ్ట్బాల్ మెగా టోర్నీ
టోర్నీలో పాల్గొననున్న 94 ఉమెన్ జట్లు.. 97 పురుషుల జట్లు
3వేల మందికి పైగా క్రీడాకారులు..40 మంది జాతీయస్థాయి న్యాయ నిర్ణేతలతో మెగా టోర్నీ
మీడియా సమావేశంలో వీఎస్యూ రిజిస్టర్ సునీత్ వెళ్లడి
విక్రమ సింహపురి యూనివర్సటీలో ఏప్రిల్ 30 నుంచి మే 8వరకు
ఆల్ ఇండియా ఇంటర్ వర్సిటీ సాఫ్ట్బాల్ మెగా టోర్నీ
-టోర్నీలో పాల్గొననున్న 94 ఉమెన్ జట్లు.. 97 పురుషుల జట్లు
-3వేల మందికి పైగా క్రీడాకారులు..40 మంది జాతీయస్థాయి న్యాయ నిర్ణేతలతో మెగా టోర్నీ
-మీడియా సమావేశంలో వీఎస్యూ రిజిస్టర్ సునీత్ వెళ్లడి
వెంకటాచలం మండలం.. కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ లో ఏప్రిల్ 30 నుండి మే 8 వరకు ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ సాఫ్ట్ బాల్ మెగా టోర్నమెంట్ జరగనున్నట్లు వి ఎస్ యు రిజిస్టర్ సునీత తెలిపారు. ఈమేరకు ఆమె వర్సిటీలో మీడియా సమావేశం ఏర్పాటుచేసి టోర్నీ వివరాలను వెళ్లడించారు. మెగా టోర్నమెంట్లో ఆలిండియా యూనివర్సిటీల నుండి 94 ఉమెన్ జట్లు, 97 పురుషుల జట్లు 3000 మందికి పైగా క్రీడాకారులతో ఈ టోర్నమెంట్ జరుగుతుందన్నారు. ఈ టోర్నమెంట్ నిర్వహించేందుకు రెఫరీలుగా జాతీయస్థాయి 40 మంది న్యాయ నిర్ణీతలుగా వ్యవహరిస్తున్నారని.. టోర్నమెంట్ నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జిల్లా మంత్రులు, ప్రజా ప్రతినిధులు పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపారు. దీనికి కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని.. ఈ మెగా టోర్నమెంట్ కి ప్రారంభ, ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యేలు మంత్రులు రాజ్యసభ సభ్యులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని ఈ సందర్భంగా ఆమె తెలిపారు .ఈ కార్యక్రమంలో వి ఎస్ యు , ప్రిన్సిపల్ CH విజయ, ప్రసాద్ రెడ్డి, నీల మణికంఠ తదితరులు పాల్గొన్నారు