రైతుల‌కు అన్యాయం జ‌రిగితే ఊరుకోం

క్రిస్ సిటీ ప్రాజెక్టుకు భూసేకరణ, పరిహారంలో అన్యాయం

మా వ‌ద్ద నుంచి భూములు లాక్కోవ‌డం త‌గ‌ద‌న్న రైతులు

రైతుల‌తో మాట్లాడిన వైసీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి పేర్నాటి శ్యామ్‌ప్ర‌సాద్‌రెడ్డి

రైతుల‌కు అన్యాయం జ‌రిగితే ఊరుకోం

  • క్రిస్ సిటీ ప్రాజెక్టుకు భూసేకరణ, పరిహారంలో అన్యాయం
  • మా వ‌ద్ద నుంచి భూములు లాక్కోవ‌డం త‌గ‌ద‌న్న రైతులు
  • రైతుల‌తో మాట్లాడిన వైసీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి పేర్నాటి శ్యామ్‌ప్ర‌సాద్‌రెడ్డి

తాము ఎన్నో సంవత్సరాల నుండి అనుభ‌విస్తున్న భూములను… మా వద్ద నుండి లాక్కొవటం అన్యాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోటం జడ్పిటిసి మాజీ సభ్యులు, కొత్తపట్నం గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ ఉప్పల ప్రసాద్ గౌడ్ కోరిక మేరకు కోట మండలం కొత్తపట్నం గ్రామపంచాయతీలోని శ్రీనివాససత్రం గ్రామానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి గ్రామానికి విచ్చేశారు. భూములు కోల్పోతున్న బాధితుల తరఫున ఆయ‌న మాట్లాడారు. ఈ ప్రాంతం గురించి క్షుణ్ణంగా గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కి తెలుసు అన్నారు. రైతులను అధికారులు బెదిరించడం మానుకోవాలన్నారు. క్రిస్ సిటీ ప్రాజెక్ట్ కి సంబంధించి కొత్తపట్నం పంచాయతీ రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *