భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా చూడాలి
సామాన్య భక్తులకు దర్శనం త్వరగా అయ్యేలా చూడాలి
దేవస్థాన ఫెస్టివల్ కమిటీ చైర్మన్ అచ్యుత్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం
పాల్గొన్న ఆర్డీవో అనూష, టీడీపీ నేత కోటంరెడ్డి, అన్నీ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు
మే 6 నుంచి 16 వరకు లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు…
- భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా చూడాలి
- సామాన్య భక్తులకు దర్శనం త్వరగా అయ్యేలా చూడాలి
- దేవస్థాన ఫెస్టివల్ కమిటీ చైర్మన్ అచ్యుత్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం
- పాల్గొన్న ఆర్డీవో అనూష, టీడీపీ నేత కోటంరెడ్డి, అన్నీ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో మే 6నుంచి 16వతేదీ వరకు జరిగే
బ్రహ్మోత్సవాల నిర్వహణఫై ఆలయ ఫెస్టివల్ కమిటీ చైర్మన్ ఇందుపూరు అచ్యుత్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా ఆర్డీవో అనూష, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి లు విచ్చేశారు. కోటంరెడ్డిని కమిటీ చైర్మన్, సభ్యులు శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్లను ఆయన దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు విజయవంతమయ్యేందుకు ప్రతీ ఒక్కరూ సమన్వయంతో పని చేయాలని సమీక్షలో సూచించారు. భక్తుల మనోభావాలు దెబ్బ తినకూడదని…. సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం త్వరగా అయ్యే విధంగా చూడాలని అధికారుల్ని, కమిటీ సభ్యుల్ని ఆదేశించారు. అనంతరం కోటంరెడ్డి, ఆర్డీవో, కమిటీ చైర్మన్ తదితరులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో సీనియర్ టిడిపి నాయకులు ఇందుపూరు శ్రీనివాసులురెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, దేవరపాలెం గ్రామం ఉప సర్పంచ్ వేమిరెడ్డి సురేంద్ర రెడ్డి, టిడిపి నాయకులు బాబు, శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ఫెస్టివల్ కమిటీ సభ్యులు, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.