భారత్‌ను విచ్చిన్నం చేయాలనే కుట్ర

పెహల్గాం అమరులకు కొవ్వొత్తుల వెలుగులతో నివాళి

కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ

బ్రిడ్జి సెంటరులో అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి ఐకాన్ సెంటర్ వరకు ర్యాలీ

భారత్‌ను విచ్చిన్నం చేయాలనే కుట్ర

  • పెహల్గాం అమరులకు కొవ్వొత్తుల వెలుగులతో నివాళి
  • కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ
  • బ్రిడ్జి సెంటరులో అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి ఐకాన్ సెంటర్ వరకు ర్యాలీ

అన్ని మతాలకు, కులాలకు నెలవైన భారత్ అభివృద్ధి పథంలో దూసుకెళుతుంటే ఓర్చుకోలేని ఉన్మాదుల ఎలాగైన భారత్ దేశంను విచ్చిన్నం చేయాలనే కుట్రలో భాగంగానే పహల్గాం ఉగ్రదాడికి నిదర్శనమని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా కావలిలో శుక్రవారం రాత్రి పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో అమరులైన భారతీయులకు శాంతి కలగాలని కావలి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కొవ్వొత్తుల వెలుగులతో నివాళి అర్పించారు. బ్రిడ్జి సెంటరులో అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి ఐకాన్ సెంటర్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఉగ్రవాదులను అణచి వేయాలని 145 కోట్ల భారతీయులు ముక్తకంఠంతో మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. పహల్గాం ఉగ్రదాడిలో ఎలాంటి కల్మషంలేని, కస్టపడి ఉన్నత స్థితికి చేరిన మన కావలి వాసి మధుసూదన్ రావును కోల్పోవడం చాలా బాధవేస్తున్నట్లు చెప్పారు. అనంతరం కావలి తహసిల్దారు శ్రావణ్ కుమార్ , మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, కావలి డిఎస్పీ శ్రీధర్ లు మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *