ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించాలి

మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి

ఉదయగిరిలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించాలి

  • మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
  • ఉదయగిరిలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

పహల్గాం ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ… ఉదయగిరి రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు.
ఉదయగిరి హై స్కూల్ నుండి బస్టాండ్ వరకు ర్యాలీ సాగింది. అనంతరం మానవహారంగా ఏర్పడి ఉగ్రవాద చర్యలను ముక్తకంఠంతో ఖండించారు. అనంతరం వారు మాట్లాడుతూ… జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల మారణకాండలో నెల్లూరు జిల్లాకు చెందిన ఒకరు మృతి చెందడం మరో 23 మంది గాయపడడం దురదృష్టకరమన్నారు. మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తీవ్రవాదులు మానవాళిపై జరిపే క్రూరమైన దాడులుగా పరిగణించాలని… ఉగ్రవాదాన్ని కూకటివేలతో సహా పెకలించేందుకు దేశమంతా ఒకటై శ్రమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ సంఘటకు కారణమైన వైఫల్యాలపై సమగ్ర విచారణ జరిపి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యాంగ పరిరక్షణ , ఆవాజ్ కమిటీ, ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *