27న కావలిలో నియోజకవర్గ స్థాయిలో దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ
తదుపరి అక్కడే కూటమి నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం
కావలి మినీ స్టేడియంలో చక చక ఏర్పాట్లు షురూ…?
దివ్యాంగులకు భరోసాగా విపిఆర్ ఫౌండేషన్
- 27న కావలిలో నియోజకవర్గ స్థాయిలో దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ
- తదుపరి అక్కడే కూటమి నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం
- కావలి మినీ స్టేడియంలో చక చక ఏర్పాట్లు షురూ…?
నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగులకు ఆత్మ విశ్వాసం నింపేలా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి భరోసాగా నిలుస్తున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లు పంపిణీ చేస్తున్నారు. అందులో భాగంగానే కావలి నియోజకవర్గంలోనూ దివ్యాంగులకు సైకిళ్లు పంపిణీ చేస్తున్నారు. ఈ నెల 27న ఆదివారం ఉదయం 10:00 గంటలకు కావలి పట్టణంలోని విశ్వోదయ ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన ఉన్న మినీ స్టేడియం మైదానంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు. కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సహకారంతో చక చక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సభా ప్రాంగణానికి ట్రై సైకిళ్లు చేర్చారు. ఈ కార్యక్రమం అనంతరం కావలి నియోజకవర్గస్థాయి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరు కానున్నారు.