సూళ్లూరుపేట ఎమ్మెల్యే కీలక సూచన

నేడు గ్రీవెన్స్ లో 65 అర్జీలు స్వీకరణ

ప్రజా సమస్య పరిష్కార వేదికలో అర్జీలపట్ల ప్రత్యేక దృష్టి

ప్రతి శుక్రవారం అర్జీలు తీసుకుంటామ‌న్న ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ

సూళ్లూరుపేట ఎమ్మెల్యే కీలక సూచన

  • నేడు గ్రీవెన్స్ లో 65 అర్జీలు స్వీకరణ
  • ప్రజా సమస్య పరిష్కార వేదికలో అర్జీలపట్ల ప్రత్యేక దృష్టి
  • ప్రతి శుక్రవారం అర్జీలు తీసుకుంటామ‌న్న ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ

ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చే అర్జీల పట్ల ప్రత్యేక దృష్టి సారించి ఆ అర్జీలకు పరిష్కార మార్గం చూపడం జరుగుతుందని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలియజేశారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని టిడిపి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ప్రజల నుంచి 65 అర్జీలను స్వీకరించారు. ఇక నుంచి ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ డే నిర్వహించి సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలు తెలుసుకుంటానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎలాంటి సమస్య ఉన్నా తనకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *