అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి

దమ్మపేట డిప్యూటీ తహసీల్దార్, ఎంపీడీవోలకు వినతి పత్రాలు అందచేసిన స్థానికులు

అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి

  • దమ్మపేట డిప్యూటీ తహసీల్దార్, ఎంపీడీవోలకు వినతి పత్రాలు అందచేసిన స్థానికులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి పంచాయతీలో ఇందిరమ్మ ఇల్లు నమూనా ప్రక్రియను అధికారులు ఇష్టానుసారంగా నమోదు చేసి…అసలైన నిరుపేదలను మోసం చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ఈ మేరకు వారు స్థానిక డిప్యూటీ తహసీల్దార్, ఎంపీడీవోలకి వినతి పత్రాలు అందచేశారు. స్థానికులు మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పేదల జీవితాలలో వెలుగులు నింపుతోందని ఆశించామన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పేదల్ని విమర్శించి నిరాశ్రయుల్ని చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి…అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని వారు కోరారు. లేని పక్షంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *