జూన్ నెలాఖరులోపు కొండాయపాళెం గేటు
బీవీ నగర్ రైల్వే బ్రిడ్జీల టెండర్లు
రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్,
వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే కీలక సమీక్ష
అతి త్వరలో శుభవార్త…
- జూన్ నెలాఖరులోపు కొండాయపాళెం గేటు – బీవీ నగర్ రైల్వే బ్రిడ్జీల టెండర్లు
- రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
- కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్, వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే కీలక సమీక్ష
నెల్లూరు ప్రజలకి శుభవార్త చెప్పే అవకాశం అతి త్వరలోనే వస్తుందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో…కమిషనర్ వైవో నందన్, వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. కొండాయపాళెం గేటు – బీవీ నగర్ రైల్వే బ్రిడ్జీలపై సమీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బ్రిడ్జీల నిర్మాణాలకు జూన్ నెలాఖరులోపు టెండర్లు పిలిచే అవకాశం ఉందని చెప్పారు. సీఎం చంద్రబాబునాయుడు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల సహాయ సహకారాలతో రూరల్ నియోజకవర్గాన్ని అన్నీ విధాలా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమీక్షలో…టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, కార్పొరేషన్ అధికారులు, టీడీపీ ముఖ్య నేతలు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.