ఓవెల్ మోడరన్ స్కూల్లో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు
ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు
విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తాం
ఓవెల్ మోడరన్ స్కూల్లో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు
ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు
నెల్లూరు నగరం.. బాలాజీనగర్ సరస్వతి నగర్లోని ఓవెల్ మోడరన్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ప్రిన్సిపల్ ప్రభాకర్ శర్మ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ప్లే క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు విద్యార్థిని, విద్యార్థులు వివిధ వేషధారణలతో.. సాంస్కృతిక కార్యక్రమాలతో.. ఆకట్టుకున్నారు. సినీ, జనపద, ఫోక్, బ్రేక్ డ్యాన్సులతో అలరించారు. ఈసందర్భంగా ఓవెల్ విద్యాసంస్థల అధినేత ఆర్. వేణు, ప్రమీళ వేణులు విద్యార్థులను అభినందించారు. యాన్యూవల్ ప్రతిభ చాటిన విద్యార్థులను అభినందించారు. అలాగే.. ఉపాధ్యాయులనూ ప్రత్యేకంగా అభినందించారు. తమ విద్యాసంస్థలలో చదివే పదో తరగతి విద్యార్థులు అత్యధిక మార్కులతో ప్రతిభ చూపారని.. అందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయులకూ వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం పలు విషయాలను వేణు మాట్లాడారు. విద్యార్థులను అన్ని రంగాల్లో తాము ప్రోత్సహించడం జరుగుతందన్నారు. ఈ కార్యక్రమంలో జీఎం మహదేవ, ఈడీ బాలు, డీజీఎం శ్రీనివాస్ యాదవ్, డీజీఎం యు. సుధాకర్, డీజీఎంలు ఆకాష్, సునీల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.