మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య
మాజీ సీఎం పిలుపు మేరకు…నెల్లూరు సిటీ వైసీపీ నేతలు కొవ్వొత్తుల ప్రదర్శన
ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య….
- మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యః
- మాజీ సీఎం పిలుపు మేరకు…నెల్లూరు సిటీ వైసీపీ నేతలు కొవ్వొత్తుల ప్రదర్శన
జమ్ము కాశ్మీర్లోని పహల్గాం వద్ద పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వీఆర్సీ సెంటర్ వద్ద నాయకులు కార్యకర్తలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నాయకులు కార్యకర్తలు నినాదాలు చేశారు. దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని.. కొవ్వొత్తులు ప్రదర్శించి.. నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీయ్య మాట్లాడుతూ… అమాయక పర్యాటకులపై.. పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన.. దాడి పిరికిపంద చర్యగా అభివర్ణించారు. పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి హేయమైన చర్యఅని అన్నారు. ఇలాంటి దాడులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకుడదని అన్నారు. బాధిత కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.