592 మార్కులు సాధించిన స్కూల్ టాపర్ గా నిలిచిన విద్యార్థి గువ్వల వెంకట లోకేష్
పదిలో వికాస్ విజయకేతనం…
- 592 మార్కులు సాధించిన స్కూల్ టాపర్ గా నిలిచిన విద్యార్థి గువ్వల వెంకట లోకేష్
బుధవారం విడుదలైన పది ఫలితాల్లో… నెల్లూరు జిల్లా సంగంలోని వికాస్ ఇంగ్లీషు మీడియం స్కూల్ విద్యార్థులు విజయకేతనం ఎగుర వేశారు. పాఠశాలకు చెందిన గువ్వల వెంకట లోకేష్ 592 మార్కులు సాధించి మండలంలో మొదటి స్థానంలో నిలిచారు. భరత్ కుమార్ అనే విద్యార్థి 588 మార్కులు సాధించి రెండో స్థానంలో నిలిచారు. పూజిత అనే విద్యార్థిని 587 మార్కులు సాధించి తృతీయ స్థానంలో నిలిచారు. పాఠశాలకు ముఖ్య అతిథులుగా ఎంఈఓ లు జానకీ రామ్, మల్లయ్య లు విచ్చేశారు. పాఠశాలకు వచ్చిన ఎంఈఓ లను సిబ్బంది స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు.