ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల్ని అభినందించిన చైర్మన్, ఉపాధ్యాయులు
సంగం జడ్పీ హైస్కూల్ విద్యార్థినికి 584 మార్కులు
- ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల్ని అభినందించిన చైర్మన్, ఉపాధ్యాయులు
పదో తరగతి ఫలితాలలో సంగం జెడ్పీ హై స్కూల్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. స్వర్ణ భారతి అనే విద్యార్థి 584 మార్కులు సాధించి మండలంలో మొదటి స్థానంలో నిలవగా..ఆర్ సోఫియా అనే విద్యార్థి 581 మార్కులు సాధించి మండలం రెండో స్థానం లో నిలిచింది. 104 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవగా..75 మంది ఉత్తీర్ణత సాధించారు. పాఠశాల చైర్మన్ మంచికలపాటి మోహన్, ప్రధానోపాధ్యాయులు బుజ్జయ్య, ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.