విడవలూరు పంచాయతీలో పబ్లిక్ గ్రీవెన్స్లో అర్జీల స్వీకరణ
ప్రజా సమస్యలు స్వయంగా తెలుసుకున్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ_
విడవలూరు పంచాయతీలో పబ్లిక్ గ్రీవెన్స్లో అర్జీల స్వీకరణ
-ప్రజా సమస్యలు స్వయంగా తెలుసుకున్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ
విడవలూరు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద.. విడవలూరు పంచాయతీకి సంబంధించి 14 వార్డుల ప్రజలకు పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొని స్వయంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారి అర్జీలను స్వీకరించారు, త్వరితగతిన పరిష్కరించే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజల పాల్గొని తమ సమస్యలను ఎమ్మెల్యేకు అర్జీ రూపంలో ఎమ్మెల్యేకు ఇవ్వడం జరిగింది. వారి సమస్యలను నేరుగా వినడం.. తెలుసుకోవడం.. అర్జీల రూపంలో స్వీకరించడంతో.. ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని.. వారికి ప్రశాంతిరెడ్డి హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు.. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నగేష్ కుమారి, ఎమ్మార్వో చంద్రశేఖర్, జడ్పిటిసి తుమ్మల లక్ష్మయ్య, మండల పార్టీ అధ్యక్షులు చెమకుల శీనయ్య ,ఎంపీపీ ఏకొల్ల శేషమ్మ, సత్యం రెడ్డి, పాశం శ్రీహరి రెడ్డి, గోవర్ధన్ రెడ్డి ,సంబంధిత అధికారులు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.