ఉగ్రవాదుల దాడిలో కావలి వాసి మృతి

కావలి పట్టణం 33వ వార్డుకు చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావుగా గుర్తింపు

భార్య, ఇద్దరు పిల్లలతో పహల్గాం కు వెళ్లిన మధుసూదన్ రావు

కావలి పట్టణం 33వ వార్డుకు చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావుగా గుర్తింపు

భార్య, ఇద్దరు పిల్లలతో పహల్గాం కు వెళ్లిన మధుసూదన్ రావు.

కావలిలో శోకసముద్రంలో మధుసూదన్ రావు కుటుంబ సభ్యులు.

పహల్గాం వద్ద మంగళవారం జరిగిన ఉగ్ర దాడిలో కావలి పట్టణం 33 వార్డు ఆనాలవారి వీధికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు మృతి చెందాడు. విషయం తెలియడంతో ఈ ప్రాంతం సోక సముద్రంగా మారింది. బెంగుళూరులో ఉంటున్న మధుసూదన్ రావు భార్య ప్రసన్న కామాక్షి, ఇద్దరు పిల్లలు మేధా శ్రీ, దత్త సాయి లతో కలిసి విహార యాత్రకు వెళ్లారు. పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడిలో మధుసూదన్ రావు అక్కడికక్కడే మృతి చెందాడు. మధుసూదన్ రావు మృతి చెందిన విషయం తల్లిదండ్రులు తిరుపారు, పద్మలకు తెలిస్తే తట్టుకోలేరని, ఇంకా వారికి కొడుకు మృతిని తెలియనివ్వలేదు. భార్య ప్రసన్న కామాక్షి ది కూడా కావలి కావడంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ ఆందోళనకు గురయ్యారు. జరిగిన దాడి ఘటనను ఆరా తీస్తున్నారు. మృతదేహంను బెంగళూరుకు తరలించి అక్కడి నుంచి రేపు కావలికి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. తండ్రి తిరుపాలు అరిటి కాయల వ్యాపారంతో కొడుకుని బాగా చదివించి ఉన్నతి స్థితికి చేర్చాడు. కొడుకు, కోడలు ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగంతో బెంగళూరులో స్థిరపడ్డారు. కానీ అనుకోని ఈ ఘటన పట్ల అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. కావలి మండల తహశీల్దారు శ్రావణ్ కుమార్ మృతుడు మధుసూదన్ రావు ఇంటివద్దకి చేరుకుని వివరాలు సేకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *