వక్ఫ్ సవరణ చట్టం రద్దు చేయాలని ముస్లిం జేఏసీ ప్రజా సంఘాలు నిరసన
జెండా చెట్టు నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ
వక్ఫ్ చట్టం స్వతంత్రను కాపాడాలి
- వక్ఫ్ సవరణ చట్టం రద్దు చేయాలని ముస్లిం జేఏసీ ప్రజా సంఘాలు నిరసన
- జెండా చెట్టు నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ
వక్ప్ చట్టం స్వతంత్రను కాపాడాలని ముస్లిం జె.ఏ.సి. ప్రజా సంఘాలు నాయకులు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో సోమవారం వక్ప్ సవరణ చట్టం రద్దు చేయాలని ముస్లిం జె. ఏ.సి. ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. జెండా చెట్టు నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. తమ డిమాండ్ ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆర్డీవో కార్యాలయంలో ఏవో సూర్య నారాయణ సింగ్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆసియా, నాయబ్ రసూల్., హఫీజ్ , లక్ష్మీ రెడ్డి లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముస్లీం పెద్దలు , మహిళలు పాల్గొన్నారు.