విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం

ఎస్పీ కార్యాల‌యంలో ప్ర‌జా ఫిర్యాదుల ప‌రిష్కార వేదిక‌

ప్ర‌జ‌ల నుంచి అర్జీలు స్వీక‌రించిన జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్

పోలీస్ సిబ్బందికి ప‌లు అంశాల‌పై సూచ‌న‌లు

ప‌లు స‌మ‌స్య‌ల‌పై 119 ఫిర్యాదులు స్వీక‌ర‌ణ‌

విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం

  • ఎస్పీ కార్యాల‌యంలో ప్ర‌జా ఫిర్యాదుల ప‌రిష్కార వేదిక‌
  • ప్ర‌జ‌ల నుంచి అర్జీలు స్వీక‌రించిన జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్
  • పోలీస్ సిబ్బందికి ప‌లు అంశాల‌పై సూచ‌న‌లు
  • ప‌లు స‌మ‌స్య‌ల‌పై 119 ఫిర్యాదులు స్వీక‌ర‌ణ‌

నెల్లూరు న‌గ‌రంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్‌లో సోమ‌వారం నిర్వ‌హించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్య‌క్ర‌మానికి 119 ఫిర్యాదులు అందిన‌ట్లు జిల్లా ఎస్పీ కృష్ణ‌కాంత్ తెలిపారు. జిల్లా న‌లుమూల‌ల నుంచి వ‌చ్చిన ప‌లువురు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పోలీసుల‌కు విన‌తులు స‌మ‌ర్పించారు. వ‌చ్చిన వారి స‌మ‌స్య‌ల‌ను క్షుణ్ణంగా వింటూ… వెంట‌నే ప‌రిష్కార‌మార్గం చూపుతూ గ్రీవెన్‌సెల్ కొన‌సాగింది. ఈ సంద‌ర్భంగా ఎస్పీ కృష్ణ‌కాంత్ మాట్లాడుతూ ప్ర‌జా ఫిర్యాదుల ప‌రిష్కార వేదిక‌లో ప‌లు ప్రాంతాల నుంచి వ‌చ్చిన వారి వ‌ద్ద నుంచి స‌మ‌స్య‌ల‌పై అర్జీల‌ను స్వీక‌రించిన‌ట్లు తెలిపారు. మొత్తం 119 ఫిర్యాదులు రాగా… వాటి స‌మ‌స్య‌పై విచారణ జ‌రిపి చ‌ట్ట‌ప‌రంగా న్యాయం చేస్తామ‌ని హామీ ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో అడిషనల్ ఎస్పీ CH.సౌజన్య, DTC DSP గిరిధర్, లీగల్ అడ్వైజర్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, SB-1 CI వెంకటేశ్వరరావు, SB-2 CI శ్రీనివాసరెడ్డి, కంప్లైంట్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *