గుజరాత్ లో మంత్రి నారాయణ బృందం

పటేల్ విగ్రహం చుట్టుపక్కల నిర్మించిన ఇతర నిర్మాణాలను పరిశీలించిన మంత్రి

గుజరాత్ లో మంత్రి నారాయణ బృందం

  • పటేల్ విగ్రహం చుట్టుపక్కల నిర్మించిన ఇతర నిర్మాణాలను పరిశీలించిన మంత్రి

గుజరాత్ లో మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ బృందం పర్యటించింది. అహ్మదాబాద్ చేరుకున్న మంత్రి నారాయణ, అధికారులకు గుజరాత్ రాష్ట్ర ప్రోటోకాల్ అధికారులు ఘన స్వాగతం పలికారు. అహ్మదాబాద్ నుంచి ఏక్తా నగర్ కు మంత్రి బృందం బస్సులో పర్యటించింది. ఏక్తా నగర్ లో సర్దార్ వల్లభాయి పటేల్ భారీ విగ్రహాన్ని మంత్రి, అధికారులు పరిశీలించారు. పటేల్ విగ్రహ నిర్మాణానికి ఉపయోగించిన సాంకేతికత, మెటీరియల్, ఇతర అంశాలను నిర్మాణ సంస్థ ప్రతినిధులు, గుజరాత్ అధికారులు వివరించారు.
అమరావతి నిర్మాణంలో భాగంగా అధికారులతో ఆయన గుజరాత్లో పర్యటించారు. మంత్రి వెంట సీఆర్డీయే కమిషనర్ కన్నబాబు, ఏడీసీ ఛైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి,గ్రీనింగ్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *