రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ శ్రీ వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి
54వ డివిజన్ లో ఘనంగా సీఎం చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు
కేక్ కటింగ్, మజ్జిగ చలివేంద్రం ప్రారంభం
దార్శనికుడు చంద్రబాబు…
- రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ శ్రీ వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి
- 54వ డివిజన్ లో ఘనంగా సీఎం చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు
- కేక్ కటింగ్, మజ్జిగ చలివేంద్రం ప్రారంభం
నెల్లూరు నగరం 54వ డివిజన్ కార్పొరేటర్ సఫియా ముజీర్ ఆధ్వర్యంలో…సీఎం చంద్రబాబునాయుడు 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి విచ్చేశారు. పట్టాభికి కార్పొరేటర్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి అందరికి పంచి పెట్టి సీఎం చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా మజ్జిగ చలివేంద్రాన్ని వేమిరెడ్డి ప్రారంభించి పేదలకు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాల్లో ఒక దార్శనికుడని అని కూడా అని కొనియాడారు. 40 ఏళ్ల దూరదృష్టితో ప్రతి కార్యక్రమాన్ని అమలు చేస్తూ దేశంలోని నాయకులందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారని తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు మునీర్ అన్వర్, సుభాని , మీరా, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.