ఐఐటీ జేఈఈ మెయిన్స్ లో కృష్ణచైతన్య అద్భుత ఫలితాలు

ఆల్ ఇండియా 274 వ ర్యాంక్ సాధించిన నెల్లూరు కృష్ణ చైతన్య కళాశాల విద్యార్థి నిర్మల్ తేజ

విద్యార్థుల్ని అభినందించిన డైరెక్టర్లు కృష్ణారెడ్డి, రానా ప్రమోద్ రెడ్డి

ఐఐటీ జేఈఈ మెయిన్స్ లో కృష్ణచైతన్య అద్భుత ఫలితాలు…

  • ఆల్ ఇండియా 274 వ ర్యాంక్ సాధించిన నెల్లూరు కృష్ణ చైతన్య కళాశాల విద్యార్థి నిర్మల్ తేజ
  • విద్యార్థుల్ని అభినందించిన డైరెక్టర్లు కృష్ణారెడ్డి, రానా ప్రమోద్ రెడ్డి

N.T.A విడుదల చేసిన జె.ఇ.ఇ (మెయిన్ )-2025 పరీక్షా ఫలితాలలో కృష్ణచైతన్య కళాశాల ఐన్ స్టీన్ క్యాంపస్ విద్యార్థులు జాతీయ స్థాయిలో అద్భుత పర్సంటైల్స్, ర్యాంకులను సాధించి కృష్ణచైతన్య కళాశాలను అగ్రభాగాన నిలబెట్టారు.. మాగుంట లేఅవుట్ లోని కళాశాల ఎదుట బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల డైరెక్టర్లు డైరెక్టర్లు కృష్ణారెడ్డి, రానా ప్రమోద్ రెడ్డిలు కాలేజీ ప్రాంగణంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఉత్తమ ర్యాంకులను సాధించిన విద్యార్థుల్ని వారు అభినందించారు. అనంతరం డైరెక్టర్లు మీడియాతో మాట్లాడారు. తమ కళాశాల విద్యార్థి నిర్మల్ తేజ ఆలిండియా 274 ర్యాంకు సాధించి తమ కళాశాల పేరును జాతీయ స్థాయిలో ఇనుమడింప చేయడం అభినందనీయమన్నారు. ఒక్క నెల్లూరు జిల్లాకు పరిమితమై, ఒకే క్యాంపస్ నుండి ఈ ఫలితాలు సాధించడం చాలా సంతోషంగా ఉందని డైరక్టర్లు తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *