నేటి వార్త మాలిక‌

క‌ల్తీలేని వార్త‌లు క‌ల‌క‌లంరేపే క‌థ‌నాలు

నెల్లూరు సుబేదారుపేటలోని సెయింట్ జోసఫ్స్ కథీడ్రల్ చర్చిలో గుడ్ ఫ్రైడే ని క్రైస్తవ సోదరులు ఘనంగా నిర్వహించారు. బిషప్ ఎండీ ప్రకాశం, టీడీపీ నగరాధ్యక్షుడు మామిడాల మధులు పాల్గొని ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.

పి ఫోర్ విధానం ద్వారా అదాని ఫౌండేషన్ ముత్తుకూరుని దత్తత తీసుకుంది. సీఎం చంద్రబాబు తీసుకువచ్చిన పీ ఫోర్ విధానం ద్వారా మోడల్ పంచాయతీగా ముత్తుకూరును అభివృద్ధి చేసేందుకు అదాని ఫౌండేషన్ ముందుకు రావడం శుభపరిణామని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు.

కోవూరులో తెలుగుదేశం పార్టీ ఎస్సీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందని వారు కొనియాడారు.

సంగం మండలం జెండాదిబ్బ గ్రామానికి చెందిన సురేష్ ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ కు గురై నెల్లూరులోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని సంగం టీడీపీ నేతలు మంత్రి లోకేష్ కి తెలియజేశారు. బాధితుడి వైద్యసాయంతోపాటు ఆ కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారన్నారు

పొదలకూరు పంచాయతీ లింగంపల్లి తోపులో దారుణం చోటు చేసుకుంది. ఇంటి బయట వాకింగ్ చేస్తున్న వ్యక్తిపై కొందరు దాడి చేసి కళ్లల్లో కారం కొట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కావలి పట్టణంలోని 39వ వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నిర్వహించారు. వార్డులోని సమస్యలను డిసెంబర్ నాటికి పరిష్కరిస్తామని ఆయన ప్రజలకి హామీ ఇచ్చారు.

సీతారామపురంలో గుడ్ ఫ్రైడే ని క్రైస్తవ సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ప్రతి ఒక్కరూ క్రీస్తు చూపిన మార్గంలో నడవాలని ఆర్ సీఎం చర్చ్ విచారణ గురువు మంద సునీల్ కుమార్ పిలుపునిచ్చారు.

ఇందుకూరుపేటలో ఎస్ఐ నాగార్జున తన సిబ్బందితో కలిసి అర్ధరాత్రి వాహనాలు తనిఖీలు చేపట్టారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నియమ నిబంధనలు పాటించని వాహనదారులకి ఆయన జరిమానా విధించి కౌన్సిలింగ్ ఇచ్చారు.

నెల్లూరులో ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ అసోసియేషన్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక ఘనంగా జరిగింది. కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పాల్గొని నూతన కమిటీకి నియామక పత్రాలు అందచేసి అభినందనలు తెలియజేశారు.

ఓ వ్యక్తి మోసపూరిత మాటలతో తాము మోస మోపాయమని బాధితులు బోరున విలపించారు. తోటపల్లిగూడూరు మండలం చింతోపు గ్రామానికి చెందిన లేబూరు మల్లికార్జున ఇంటి ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరగకపోతే…ఆత్మహత్యే శరణ్యమని వారు కన్నీటి పర్యంతమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *